కర్ణాటకలో రోడ్డు ప్రమాదం ,ఆగిఉన్న లారీని జీపు ఢీ,.. ఏపీకి చెందిన ఐదుగురి దుర్మరణం
కలబురిగి: 06,జూన్( హిం.స)కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరి జిల్లాలో ఆగిఉన్న లారీని జీపు ఢీక
kalbuurgi


కలబురిగి: 06,జూన్( హిం.స)కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరి జిల్లాలో ఆగిఉన్న లారీని జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులను నంద్యాల జిల్లా వెలుగోడు వాసులుగా గుర్తించారు. కలబురిగిలోని దర్గా ఉరుసు జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను మునీర్(40), నయామత్(40), రమీజా బేగం(50), ముద్దత్ షీర్ (12), సుమ్మి(13)గా గుర్తించారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande