విజయవాడ, జూన్ 7 (హిం.స): ఈ ఏడాది ఆగస్టు 7న తిరుపతిలో జాతీయ ఓబీసీ సభ జరుగుతుందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.
విజయవాడలో మంగళవారం మాట్లాడారు. అంతకుముందు జాతీయ ఓబీసీ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలో జరగనున్న సభకు 29 రాషా్ట్రలకు చెందిన 50 వేల మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను, వివిధ రాషా్ట్రల సీఎంలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా నెలకొన్న బీసీల సమస్యలపై చర్చించి భవిష్యత కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.
హిందూస్తాన్ సమాచార ,రాజీవ్