ఒడిసా07 జూన్ (హిం.స) ఒడిసాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సికింద్రాబాద్–అగర్తల ఎక్స్ప్రెస్లోని ఏసీ బోగీ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనతో రైల్వే అధికారులు బ్రహ్మపూర్ స్టేషన్లో రైలును నిలిపివేశారు. బీ–5 ఏసీ కోచ్లో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో అందరూ హుటాహుటిన రైలు దిగి, అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఏసీ యూనిట్లో మంటలు వచ్చినట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు. కాగా, ఆందోళనకు గురైన కొందరు ప్రయాణికులు మళ్లీ ఆ కోచ్లోకి ఎక్కడానికి నిరాకరించారు. మహారాష్ట్రలోని మారిథాన్ హిల్ స్టేషన్ నుంచి నేరల్కు వెళ్తున్న టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది. మరో ఘటనలో, మంగళవారం ముజఫర్పూర్ నుంచి యశంతపూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు(15228) ఇంజన్లో రాత్రి 7.30 గంటల సమయంలో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది.
హిందూస్తాన్ సమాచార ,రాజీవ్