
తిరుపతి 1 నవంబర్ (హి.స.)
:శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమల(Tirumala)కు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది. అనంతరం భక్తులు టీటీడీ సెక్యూరిటీ(TTD Security)కి సమాచారమిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ