
ఢిల్లీ, 11 నవంబర్ (హి.స.)భారతదేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు (Huge explosion) సంభవించింది. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఈ పేలుడు కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉహించని ఘటనపై ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి ఉగ్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ పెలుడు ఘటనపై బాగేశ్వర్ ధామ్ సర్కార్ ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (Bageshwar Dham Sarkar Acharya Dhirendra Krishna Shastri) తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ పెలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను ఉరితీయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. సనాతన వాదులు ఐక్యమైతే, బెదిరింపులు యొక్క ఈ మతపరమైన భావజాలం పూర్తిగా ఆగిపోతుంది. ఆలోచనలో మార్పుకు హిందూ ఐక్యత ముఖ్యం. తన యాత్ర యొక్క మిగిలిన భాగం సజావుగా సాగుతుంది. అంతరాయం లేకుండా కొనసాగుతుంది. హర్యానా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీనిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ఎటువంటి పుకార్లకు లొంగవద్దని మేము అందరూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము... అని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV