
జోగులాంబ గద్వాల, 12 నవంబర్ (హి.స.)
రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోలు
చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ సీసీఐ అధికారులను ఆదేశించారు. బుధవారం అలంపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% లోపు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేస్తున్నందున రైతులు దాని ప్రకారం ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం స్లాట్ బుకింగ్ విధానంలో ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తుండగా, 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని, అకాల వర్షాలతో పత్తి దెబ్బతినడంతో తేమ ఎక్కువగా ఉన్న కొనాలని పలువురు రైతులు కలెక్టర్ ను కోరారు. ఇటీవలే ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..