
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)
విద్యార్థుల సృజనను వెలికితీసేలా చిత్ర ప్రదర్శనలోని చిత్రాలున్నాయని సురభి ఎడ్యుకేషనల్ చైర్మెన్, ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మెన్ దివంగత సురభి దయాకరరావు 82వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ మాదాపూర్లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన చిత్రకళ, ఫోటోగ్రఫీ, ఆప్లైడ్ ఆర్ట్స్ విభాగాల విద్యార్థుల చిత్రప్రదర్శనలను ఆదివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి దయాకరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ... విద్యార్థులు వేసిన చిత్రాలు, ఫోటోగ్రఫీలు అద్భుతంగా ఉన్నాయని, భవిష్యత్తులో ఫైన్ ఆర్ట్స్ రంగంలో మెరుగైన అవకాశాలుంటాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు