తూర్పు గోదావరి జిల్లా పెరమలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు.వద్ద పాఠశాల.బస్సు.బోల్తా
అమరావతి, 9 డిసెంబర్ (హి.స.) తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఉండ్రాజవరం మండలం తాటిపర్రులోని జ్యోతి స్కూల్‌కి చెందిన 25 మంది విద్యార్థులతో వెళ్తోన్న బస్సు.. ఏటిగట్టుపై మలుపు తిప్పుతుండగా అదు
తూర్పు గోదావరి జిల్లా పెరమలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు.వద్ద పాఠశాల.బస్సు.బోల్తా


అమరావతి, 9 డిసెంబర్ (హి.స.)

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఉండ్రాజవరం మండలం తాటిపర్రులోని జ్యోతి స్కూల్‌కి చెందిన 25 మంది విద్యార్థులతో వెళ్తోన్న బస్సు.. ఏటిగట్టుపై మలుపు తిప్పుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. పాఠశాల ఆయా పద్మావతి కాలికి తీవ్ర గాయం కావడంతో తణుకు ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా బస్సు పల్టీ కొట్టడంతో విద్యార్థులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande