పిరపురం.పరిధిలోని. జాతీయ రహదారి పై రోడ్డుప్రమాదం లో.ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్.దుర్మరణం
అమరావతి, 9 జూన్ (హి.స.) పిఠాపురం, పిఠాపురం పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ దుర్మరణం చెందారు. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం.. స్థానిక రాపర్తి గ్రామస్థురాలు మమత(32) దుర్గాడకు చెందిన తన మేనమామ నాగేశ్వ
పిరపురం.పరిధిలోని. జాతీయ రహదారి పై రోడ్డుప్రమాదం లో.ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్.దుర్మరణం


అమరావతి, 9 జూన్ (హి.స.)

పిఠాపురం, పిఠాపురం పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ దుర్మరణం చెందారు. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం.. స్థానిక రాపర్తి గ్రామస్థురాలు మమత(32) దుర్గాడకు చెందిన తన మేనమామ నాగేశ్వరరావును కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. రెండేళ్లుగా ఆమె గొల్లప్రోలులోని మాధురి విద్యాలయంలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం దంత వైద్యం కోసం కాకినాడకు ద్విచక్ర వాహనంపై కుమారుడు సుహాస్‌(8), జగ్గంపేటకు చెందిన తన మేనకోడలు సోమలత(17)తో కలిసి వెళ్తుండగా పిఠాపురంలోని భీమ్‌నగర్‌ కూడలి వద్ద గేదె అడ్డంగా వచ్చింది. దాంతో వాహనం అదుపుతప్పి మమత కిందపడిపోయారు. హెల్మెట్‌ ధరించినప్పటికీ బెల్టు పెట్టుకోకపోవడంతో ఊడిపోయి మమత తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు సుహాస్, మేనకోడలు సోమలత గాయపడడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మమత మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై మణికుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande