రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి
తెలంగాణ, జగిత్యాల. 20 జూలై (హి.స.)గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. జగిత్యాల జిల్ల
పసుపు బోర్డు చైర్మన్


తెలంగాణ, జగిత్యాల. 20 జూలై (హి.స.)గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ముత్యంపేటలో మూతపడిన చక్కెర కర్మాగారం పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ మల్లాపూర్ నుండి ముత్యంపేట చక్కెర కర్మాగారం వరకు తలపెట్టిన పాదయాత్రను ఆదివారం వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎంపీ అర్వింద్ ఈ ప్రాంత రైతులకు ఇచ్చిన హామీ మేరకు పసుపు పంటకు ప్రత్యేక బొర్డును తీసుకువచ్చి, ఇక్కడే రైతుల సౌకర్యార్థం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో మరోసారి రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండా తీర్చుతామాని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ దేవుళ్లపై ఓట్లు వేశారని గుర్తు చేశారు. అలాగే ఇప్పటికే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, రైతుబంధు, వరిపంటకు బోనస్ అంశాలపై పూర్తిగా విఫలమైందని, బీజేపీ అధికారంలోకి వస్తే వంద శాతం మూతపడిన నిజాం చక్కెర కర్మాగారంలను తెరిపిస్తామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande