విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ
విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ
విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ


విశాఖ, 24 మే (హి.స.)

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగింది. విశాఖ మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ ఆత్మీయ అవలోకన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దత్తాత్రేయ రాజకీయ జీవితం, ఆయన చేసిన ప్రజా సేవ, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న బలమైన అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ వేడుకకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ... సామాన్య ప్రజల మధ్య నుంచి ఎదిగి, గవర్నర్ వంటి అత్యున్నత పదవిని అధిరోహించిన బండారు దత్తాత్రేయ జీవిత ప్రయాణం నేటి యువతకు ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande