
ముంబై, 24 మే (హి.స.)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మే 24న వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ముంబై ఇండియన్స్ VS రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఈ రెండు జట్లకే కాకుండా, ప్లేఆఫ్ రేసులో ఉన్న ఇతర జట్ల భవితవ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే జట్టు 16 పాయింట్లకు చేరుకుని ప్లేఆఫ్ అవకాశాలను మరింత బలపరుచుకుంటుంది. దీంతో ఇతర జట్లపై ఒత్తిడి పెరగనుంది.
ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్ గెలుపు ఎంతో కీలకం. ప్రస్తుతం జట్టు తక్కువ పాయింట్లతో దిగువ స్థానాల్లో కొనసాగుతోంది. అయితే మెరుగైన నెట్ రన్డేట్ కారణంగా చివరి స్థానంలో లేదు. ఈ మ్యాచ్లో గెలిచి సీజనను గౌరవప్రదంగా ముగించాలని హార్దిక్ పాండ్యా సేన భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..