అమరావతి, 10 జూన్ (హి.స.)
గుంటూరు: అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకాణిపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కాకాణిని సీఐడీ అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ