అమరావతి, 10 జూన్ (హి.స.)
:ఏపీ మహిళలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ( చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సజ్జల వ్యాఖ్యలను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. తాజాగా వైసీపీ నేత చేసిన కామెంట్స్పై ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ) స్పందిస్తూ.. మహిళల మీద సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలను పిశాచులతో పోల్చుతారా.. మహిళలను రాక్షసులు అంటారా అంటూ ఫైర్ అయ్యారు. సంకర జాతి అని మహిళలను అవమానిస్తారా అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ