అమరావతి, 10 జూన్ (హి.స.)
, శ్రీకాకుళం సాంస్కృతికం: పాత శ్రీకాకుళంలో పదేళ్లకోసారి జరిగే పెద్ద పండగ సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా జడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వద్ద కొత్తపేట, కునుకుపేట వరకు మంగళవారం రెండు సిరిమానులు దర్శనమివ్వనున్నాయి. పెద్దమ్మ, నూకాలమ్మ, దుర్గమ్మ, సన్నాలపోలమ్మ అమ్మవార్ల పేరిట జరిగే వేడుకకు సిరిమానులు, రథాలు సిద్ధమయ్యాయి. ఊరేగింపునకు పడవ (నక్కవీధి), ఏనుగు (దండివీధి), రథం (బాదుర్లపేట), కలెక్టర్ బంగ్లా వద్ద లోకనాథం కుటుంబం తరఫున మహిషాసురమర్దిని విగ్రహాన్ని అలంకరించారు. జడ్పీ నుంచి కునుకుపేట వరకు విద్యుద్దీపాలతో కళకళలాడుతోంది. అమ్మవార్ల చదురుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ