హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి పర్యటన రెండవ రోజు కూడా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో తాజాగా సీఎం రేవంత్ భేటీ అయ్యారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. కాగా, కొత్తగా రాష్ట్ర మంత్రివర్గంలోకి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేరిన విషయం తెలిసిందే. వీరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు?.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం దగ్గర శాఖలు కేటాయిస్తారా?. ఇతర మంత్రులకు తగ్గించి.. ఈ ముగ్గురికి కేటాయిస్తారా అన్నది సస్పెన్స్గా మారింది. దీనికి మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం ఉంది. దీనిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ అవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..