హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
ఎన్డీయే ప్రభుత్వం 11 ఏళ్ల పాలన
విజయవంతంపై దేశ వ్యాప్తంగా బీజేపీ 11 ఏళ్ల సేవ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తాందని అన్నారు. అలాగే ప్రస్తుతం భారత్ అభివృద్దిలో దూసుకుపోతుందని.. యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తోందని కిషన్రెడ్డి చెప్పుకొచ్చారు. మోడీ పాలనలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. 11 ఏళ్ల మోడీ పాలనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, పన్నుల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని, రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
అలాగే భారత్ పై దాడులు చేసిన పాకిస్తాన్ ఉగ్రదాడులను తిప్పికొట్టామని మరోసారి గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో రైతులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. దేశ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, తమ నిర్ణయాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. అలాగే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేల సంఖ్యలో రైల్వేలను అభివృద్ధి చేశామని, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన వందే భారత్ రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం తీసుకొచ్చామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..