అమరావతి, 10 జూన్ (హి.స.)
తిరుమల: తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దాదాపు వంద మీటర్ల మేర అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. శ్రీవారి పాదాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ