అమరావతి, 10 జూన్ (హి.స.)
పిఠాపురం, : జిల్లాలో ఎక్కువ శాతం వరి పంటే సాగు చేస్తున్నారు. ఏటా వరదలు, చీడపీడలతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు రైతులను ప్రత్యామ్నాయంగా బహుళ వార్షిక పంటల దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఆసక్తి పెంచేలా అవగాహన కల్పిస్తున్నారు. బోర్లతో సాగుచేసే ప్రాంతాల్లో రైతులను గుర్తిస్తున్నారు. ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీలు కూడా ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ