అమరావతి, జూన్ 10 (హిం.స)
బాపట్ల : బాపట్లలోని సూర్యలంక బీచ్ పర్యాటకుల సందర్శనలో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. సహజసిద్ధ సుందరమైన సమతల బీచ్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. వారాంతాల్లో హైదరాబాద్ నుంచి వేలమంది పర్యాటకులు తరలివస్తున్నారు. పర్యాటక శాఖకు చెందిన బీచ్ రిసార్ట్స్లో 32 గదులు మాత్రమే ఉన్నాయి. ఇటీవల అదనంగా మరో ఏడు గదుల నిర్మాణం చేపట్టారు. శుక్ర, శని, ఆదివారాలు ఖాళీ ఉండటం లేదు. రెండు, మూడు నెలల క్రితమే ఆన్లైన్లో గదులను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. రిసార్ట్స్ కాటేజీలో కూర్చొని సముద్ర అలలు, సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలను తిలకించే అవకాశం ఉండటం ఈ రిసార్ట్స్ ప్రత్యేకత. సూర్యలంకకు వచ్చే వారంతా రిసార్ట్స్లో బస చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ