హైదరాబాద్, 11 జూన్ (హి.స.)
కాళేశ్వరం విచారణ వెనుక రేవంత్ రెడ్డి కక్ష్య పూరిత దురుద్దేశం ఉందన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కెసిఆర్ , ఈటల, హరీష్ రావు, తదితర ఉన్నతాధికారులకు కమిషన్ నోటీసులు ఇచ్చిందని, వారంతా ఓపెన్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే, కెసిఆర్ మాత్రం ఓపెన్ కోర్టులో ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా రాష్ట్ర బాగు కోసమే కట్టి ఉంటే, ఇపుడు ఈ విచారణ అవసరం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ మార్పులు ముమ్మాటికీ దోచుకోవడానికే జరిగాయని స్పష్టం చేశారు. కమిషన్ మీద ఎలాంటి ప్రభుత్వ ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగా పనిచేస్తోందని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్