అమరావతి, 11 జూన్ (హి.స.)
ఏర్పేడు, విద్యుదాఘాతంతో తిరుపతి భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ(ఐసర్)లో మంటలు వ్యాపించాయి. కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నట్లుండి మంగళవారం విద్యుదాఘాతం ఏర్పడటంతో సకాలంలో స్పందించిన ఐసర్ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులు, ఆచార్యులను తరగతి గదుల నుంచి బయటకు పంపారు. అనంతరం శ్రీకాళహస్తి, వెంకటగిరిలోని అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. అగ్నిమాపక యంత్రాలు ఐసర్కు చేరుకునేలోపే ల్యాబ్లోని కొన్ని రకాల రసాయనాలకు నిప్పు అంటుకోవడంతో దట్టమైన నల్లటి పొగ పెద్దఎత్తున వ్యాపించింది. ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు స్థానికులు మాస్క్లు ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చిన్నపాటి రసాయనాలు, ఫ్రిజ్ వంటివి కాలిపోయాయని ఐసర్ డైరెక్టర్ ఎస్.భట్టాచార్య తెలిపారు. దీనిపై నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర విద్యా వనరుల మంత్రిత్వశాఖ ఆరా తీసినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ