అమరావతి, 11 జూన్ (హి.స.)
vysipi ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు. పొదిలిలోని బేస్తపాలెం దగ్గర జగన్ కాన్వాయ్ మీద నల్ల బెలూన్లు, చెప్పులను గుర్తు తెలియని మహిళలు విసిరారు.
వైఎస్ జగన్ కాన్వాయ్ పైకి చెప్పులు, నల్ల బెలూన్లు విసరడంతో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడిలో రాళ్లు, చెప్పులతో ఒకరిపై మరోకరు ఘర్షణకు పాల్పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ