అమరావతి, 11 జూన్ (హి.స.)
అనంతపురం (కమలానగర్), : అనంతపురంలో ఇటీవల దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినందుకే విద్యార్థిని తన్మయిని యువకుడు నరేశ్ హత్య చేశాడని వారు చెప్పారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ జగదీశ్ మంగళవారం విలేకర్లకు వెల్లడించారు. ‘‘అనంతపురంలోని రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి, అరుణ దంపతుల కుమార్తె తన్మయికి నగరంలోని ఆరో రోడ్డుకు చెందిన నరేశ్తో 3 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని తన్మయి నరేష్పై ఒత్తిడి తెచ్చింది. అప్పటికే తనకు వివాహం అయిందని, ఇద్దరినీ పోషించటం సాధ్యం కాదని అతడు చెప్పుకొచ్చాడు. దీనికి ఆమె వినకపోవటంతో హత్య చేయాలని భావించాడు. పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఎప్పుడూ కలుసుకునే ప్రాంతానికి రావాలని పిలిచాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ