హైదరాబాద్, 11 జూన్ (హి.స.)
సికింద్రాబాద్ కార్ఖాన వద్ద బీఆర్ఎస్
అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ లో భాగంగా ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నేతలు కాసేపు ఆందోళనకు గురయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనకనుండి మరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పాక్షికంగా ధ్వంసమైంది. ఢీకొన్న రెండో కారుకూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద స్థలానికి సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ నియంత్రించారు. వాహనాలను పక్కకు తప్పించి రూటును క్లియర్ చేశారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్