హైదరాబాద్, 11 జూన్ (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసిఆర్ కాలేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన అనంతరం బి ఆర్ కే భవనం నుండి మీడియాతో కూడా మాట్లాడకుండా నేరుగా సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి కి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. జారీ పడటంతో కాలు విరిగిపోయింది. ప్రస్తుతం ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. విచారణ అనంతరం నేరుగా.. కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్