హైదరాబాద్, 11 జూన్ (హి.స.)
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో
నిర్మితమైన మాంగళ్య షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. సుమారు 8 నెలల క్రితం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే మాల్ను ప్రారంభించగా, ప్రారంభోత్సవానికి సినీ నటి హాజరయ్యారు. ఈ వ్యవహారంపై గతంలో అనేకసార్లు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినా మాల్ యాజమాన్యం స్పందించకపోవడంతో చివరికి చర్యకు దిగారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్