తెలంగాణ, హుస్నాబాద్. 11 జూన్ (హి.స.)
రైతుల సంక్షేమానికి మొదటి
ప్రాధాన్యత ఇస్తూ ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర వంటి వాటిని ప్రవేశపెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలంలో ఎడ్లతో నాగలి దున్ని రైతులతో కలిసి మంత్రి పెసర విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేస్తారని చెప్పారు. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి పాడిపంటలతో అలరారారని తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు