న్యూఢిల్లీ, 11 జూన్ (హి.స.)
దేశ రక్షణ బడ్జెట్ను
20 శాతం పెంచేందుకు పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్ లో 9 బిలియన్ డాలర్లను రక్షణశాఖకు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా నిధులతో మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేయనుంది. 2022లో పాక్ లో వరదల కారణంగా 3.3 కోట్ల మంది వరద ప్రభావిత బాధితులు ఉన్నారు. దాదాపు ఆ సమయంలో ఏకంగా 15 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాలు పేర్కొన్నాయి. వీటిని మెరుగుపరిచేందుకు మొగ్గు చూపలేదు. ఇంత జరిగినా కూడా పాకిస్థాన్ తన ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకే మొగ్గు చూపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..