చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.. న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కే స్వప్నారాణి
తెలంగాణ, పెద్దపల్లి. 11 జూన్ (హి.స.) చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు, అదే చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగితే అన్ని రకాల సమస్యలను అధిగమించి అభివృద్ధి వైపు వెళ్తామని న్యాయసేవాధికార సంస్థ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి, జడ్జీ కె. స్వప్నా రా
పెద్దపల్లి జిల్లా జడ్జి


తెలంగాణ, పెద్దపల్లి. 11 జూన్ (హి.స.)

చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు, అదే చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగితే అన్ని రకాల సమస్యలను అధిగమించి అభివృద్ధి వైపు వెళ్తామని న్యాయసేవాధికార సంస్థ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి, జడ్జీ కె. స్వప్నా రాణి అన్నారు. పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో బుధవారం నిర్వహించిన న్యాయవిజ్ఞానసదస్సుకు ఆమే ముఖ్య అతిథిగా హాజరై పలు రకాల చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయసేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందించే సేవలను, న్యాయసలహాలు పొందాల్సిన తీరుపై వివరించారు.

సదస్సుకు హాజరైన పలువురు న్యాయవాదులు వివిదరకాల చట్టాలపై అవగాహన కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande