పోలీసులపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి.. పలువురికి గాయాలు
ప్రకాశం , 11 జూన్ (హి.స.)పొగాకు బోర్డు వద్ద రైతులతో మాట్లాడేందుకు మాజీ సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో పొదిలి లో మహిళలు నిరసనకు దిగారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్ధించారంటూ నల్ల బెలూన్లతో తమ బస్టాండ్ వద్ద తమ నిరసన తెలియజేశారు. జగన్ క్షమాపణ చెప్ప
పోలీసులపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి.. పలువురికి గాయాలు


ప్రకాశం , 11 జూన్ (హి.స.)పొగాకు బోర్డు వద్ద రైతులతో మాట్లాడేందుకు మాజీ సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో పొదిలి లో మహిళలు నిరసనకు దిగారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్ధించారంటూ నల్ల బెలూన్లతో తమ బస్టాండ్ వద్ద తమ నిరసన తెలియజేశారు. జగన్ క్షమాపణ చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ మహిళలని దారుణంగా అవమానించిన కొమ్మినేని, సజ్జల, కృష్ణంరాజుని వెనకేసుకుని వస్తున్న జగన్.. సిగ్గు సిగ్గు.. అంటూ వారు నినాదాలు చేశారు. నీ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు.. ఏపీలో ఏ మూలకు వెళ్లినా మహిళలు నిన్ను వదిలి పెట్టరు.

జగన్ చేయిస్తున్న పనులకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అక్కడి మహిళలు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్‌లో, వైకాపా నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిలిలో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande