ప్రధానితో భేటీ కావాలంటే ఆర్టీపీసీఆర్‌ టెస్టు తప్పనిసరి
ఢీల్లీ, 11 జూన్ (హి.స.)దేశంలో కొవిడ్‌(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 7వేలు దాటింది. దేశంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానితో భేటీ కావాలంటే ఆర్టీపీసీఆర్‌ టెస్టు తప్పనిసరి


ఢీల్లీ, 11 జూన్ (హి.స.)దేశంలో కొవిడ్‌(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 7వేలు దాటింది. దేశంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని కలిసే మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ (RT-PCR) పరీక్ష చేయించుకోవాలని పీఎంఓ సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక తాజా డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదవడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,121లకు చేరింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande