తెలంగాణ, రంగారెడ్డి. 11 జూన్ (హి.స.)
బండ్లగూడ జాగిర్ మున్సిపల్
కార్పొరేషన్ను ఆదర్శంగా తీర్చి దిద్దుతామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు కోట్ల 30 లక్షలతో వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు ఆయన స్థానికులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతి మున్సిపాలిటీ, డివిజన్ లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామిగా తీర్చిదిద్దుతానని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు