హైదరాబాద్, 11 జూన్ (హి.స.)
తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడారు. నేడు హైదరాబాదులో మాట్లాడిన హరీష్ రావు.. కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారని పేర్కొన్నారు. ఇతరులు అధికారం వెంటబడితే.. కేసీఆర్ మన జీవితాలను మార్చారు. కాంగ్రెస్ కుట్ర గానీ, విచారణ కమిషన్ గానీ కేసీఆర్ ఘనతను తుడిచిపెట్టలేవు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివి అని హరీశ్రావు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్