హైదరాబాద్, 11 జూన్ (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో నేడు ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కీలక మలుపు తిరిగింది. నేటి ఉదయం హైదరాబాద్ లోని BRK భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఓపెన్ కోర్ట్లో విచారించాలని కమీషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయనను మినహాయించి అందరిని అక్కడి నుండి బయటకు పంపించిన అనంతరం వన్ టు వన్ విచారణకు సిద్ధమయ్యారు. కోర్టు హాల్ నుండి ఇతరులందరినీ బయటకు పంపిన ఘటన తీవ్ర ఉత్కంఠను రేపింది.
ఈ క్రమంలో కేసీఆర్ ఓపెన్ కోర్టులో స్వయంగా హాజరయ్యారు. జస్టిస్ ఘోష్ ఆయనను ప్రత్యక్షంగా ప్రశ్నించడమే కాకుండా, అన్ని విషయాల్లో వాస్తవాలను తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా విచారణ చేశారు. ఇక ఇదే సమయంలో BRK భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తమ నేత కేసీఆర్కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..