ప్రైవేటు.వాహనాల్లో ప్రయాణించే వారు. సురక్షితంగా గమ్య స్థానాలకు.చేరుకునేలా.ట్రాకింగ్ డివైస్ లు
అమరావతి, 11 జూన్ (హి.స.) హైదరాబాద్‌: ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లుచేసే విషయమై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ప్రజారవాణా వాహనాలకు ‘వెహికిల్‌ ట్రాకింగ్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌’ల ఏర్పాట
ప్రైవేటు.వాహనాల్లో ప్రయాణించే వారు. సురక్షితంగా గమ్య స్థానాలకు.చేరుకునేలా.ట్రాకింగ్ డివైస్ లు


అమరావతి, 11 జూన్ (హి.స.)

హైదరాబాద్‌: ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లుచేసే విషయమై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ప్రజారవాణా వాహనాలకు ‘వెహికిల్‌ ట్రాకింగ్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌’ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రవాణాశాఖ అధికారులు పంపించిన ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. ప్రస్తుతం ఈ దస్త్రం ఆర్థికశాఖకు చేరింది. సీఎం ఆమోదం లభిస్తే కేంద్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఏజెన్సీని ఎంపిక చేయడంతో పాటు ‘డివైజ్‌’లను ఉత్పత్తిచేసే కంపెనీ ఎంపిక ప్రక్రియను చేపడతారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande