అమరావతి, 12 జూన్ (హి.స.)
, హైదరాబాద్: రాష్ట్రంలో నేటి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు సూచించింది.
గురువారం: ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల.
శుక్రవారం: నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల.
శనివారం: ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్; నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.
ఆదివారం: ఆదిలాబాద్, కుమురంభీంఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ