నెల్లూరు, 12 జూన్ (హి.స.)
:మతసామరస్యానికి ప్రతీకగా, రాష్ట్ర పండుగగా నెల్లూరులో ఏటా జరిగే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ జూలై 6వ తేదీన ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకను విజయవంతంగా పూర్తి చేసేందుకు బుధవారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేయర్ స్రవంతి, కమిషనర్ నందన్ అధికారులతో సమీక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ