రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! ఎప్పుడంటే..?
అమరావతి, 12 జూన్ (హి.స.)నైరుతి రుతుపవనాల్లో కదలిక, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయగా.. ఏ
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! ఎప్పుడంటే..?


అమరావతి, 12 జూన్ (హి.స.)నైరుతి రుతుపవనాల్లో కదలిక, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయగా.. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రెండు రోజులపాటు తెలంగాణలో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

ఏపీలో పలు జిల్లాల్లో రెండు రోజులపాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇప్పటికే.. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. ఇదిలావుంటే.. ఏపీలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా.. విజయనగరం, మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో రెండు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande