తెలంగాణ, ఆదిలాబాద్. 14 జూన్ (హి.స.)
ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఒకరికి రక్తదానం చేస్తే ప్రాణం కాపాడిన వారు అవుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదానం అనేది అన్ని దానాల కంటే గొప్ప దానం అని అన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినప్పుడే ఆపద సమయంలో ఉపయోగ పడుతుందని, రక్తం ఏ సమయంలో ఎప్పుడు అవసరం అవుతుందో ఎవరికి తెలియదన్నారు. ప్రమాదాల బారిన పడిన సమయంలో, రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇలా రకరకాల సమయాల్లో రక్తం అవసరమవుతుందని, స్వచ్ఛంద సంస్థలు రక్తదానాల శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఆపదలో ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని, జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు రక్తదానం శిబిరాలు నిర్వహించటం అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం ఉంటే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారని ఆన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు