ప్రజల సొమ్మును దోచుకుంటే ఏజెన్సీలు దర్యాప్తు చేయడం తప్పా? ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, 14 జూన్ (హి.స.) గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతున్నాయని ఇందులో కక్ష సాధింపు చర్యలు ఏముందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల సొమ్మును దోచుకుంటే
ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి


హైదరాబాద్, 14 జూన్ (హి.స.)

గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతున్నాయని ఇందులో కక్ష సాధింపు చర్యలు ఏముందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల సొమ్మును దోచుకుంటే ఏజెన్సీలు దర్యాప్తు చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఇవాళ మేము ఒళ్లు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయకుండా తప్పులు చేస్తే రేపు మాపై కూడా కమిషన్లు వస్తాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఏడాదిన్నర పరిపాలించిన మాపై ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ కంటే మంచి ఇంగ్లీష్ వచ్చిన ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఉన్నారని వారెవరు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇంతలా విషబీజాలు నాటలేదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande