తెలంగాణ, జహీరాబాద్. 14 జూన్ (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు. జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాణిక్ రావు మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారన్నారు. మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో వారిపై హస్తం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమైందని విమర్శించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు