ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడిన వర్గపోరు..
హైదరాబాద్, 14 జూన్ (హి.స.) ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయట పడింది. నేడు బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన పార్టీ సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సమావేశంలో కార్పొరేటర్ విజయ రెడ్డి
ఖైరతాబాద్ కాంగ్రెస్


హైదరాబాద్, 14 జూన్ (హి.స.)

ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి

వర్గపోరు బయట పడింది. నేడు బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన పార్టీ సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

సమావేశంలో కార్పొరేటర్ విజయ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్త మాట్లాడుతుండగా సమావేశానికి ఆలస్యంగా రావడం క్రమశిక్షణ కాదని సమయం సరిపోదని అభ్యంతరం తెలిపారు. దీంతో సీనియర్ నాయకురాలు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విజయ రెడ్డి కి తన అనుచరులకు సముచిత గౌరవం ఇవ్వట్లేదని, ప్రోటోకాల్ పాటించట్లేదని విజయ రెడ్డి వర్గీయులు వాగ్వాదం చేయడంతో ఇరువర్గాల మధ్య రభస మొదలైంది. పార్టీ క్రమశిక్షణ పాటించకపోతే ఊరుకునేది లేదని డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి హెచ్చరించారు. దీంతో పోటా పోటీగా ఇరు వర్గాల అనుచరులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అక్కడ నుండి అసంతృప్తితో వెళ్లిపోయారు.

వీరిద్దరూ బహిరంగంగా వాగ్వాదానికి దిగడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande