హైదరాబాద్, 14 జూన్ (హి.స. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని బీజేపీ గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్(BJP Goshamahal MLA Raja Singh) కోరారు. శుక్రవారం మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత రెండు మూడు రోజుల నుంచి కొందరు వ్యక్తులు ఫోన్చేసి బాంబులతో దాడిచేసి కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజాసింగ్కు వచ్చిన ఫోన్ కాల్స్(Phone calls) ఏ నంబర్ల నుంచి వచ్చాయి. వాటి సిమ్ కార్డులను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు. లోకేషన్ను ట్రేస్ చేసే పనిలో ఉన్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు