హైదరాబాద్, 14 జూన్ (హి.స.)
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ సూచించారు. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ), జనహిత ఫౌండేషన్, కిమ్స్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భోలక్పూర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వ్యాధులతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అన్నారు. అనారోగ్య సమస్యలు ఎదురైన వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ వైద్య సంస్థలు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు అందించే వైద్య సేవలను మురికివాడల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్