ప్రకాశం, 14 జూన్ (హి.స.)
:పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లినప్పుడు వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న మహిళలపై వైసీపీ మూకలు దాడి చేశాయి. మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు, ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ