తెలంగాణ, మహబూబాబాద్. 14 జూన్ (హి.స.)
కక్షిదారులు క్షణికావేశంలో
పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీపడదగిన, మనోవర్తి, గృహ హింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసుల్లో ఇరువర్గాలు కోర్టుకు వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లైతే ఇరు వర్గాలు గెలిచినట్లే అవుతుందని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఇల్లందు మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాజీపడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీపడితే ఎంతో విలువైన కాలాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు పంతాలకు పోకుండా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు