నీట్ యూజీ.2025 లో ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు
అమరావతి, 15 జూన్ (హి.స.) అమరావతి: నీట్ (యూజీ -2025)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుతంగా రాణించారన్నారు. దేశవ్యాప్తంగా 18వ ర్యాంకు సాధించిన తెలంగాణకు చ
నీట్ యూజీ.2025 లో ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు


అమరావతి, 15 జూన్ (హి.స.)

అమరావతి: నీట్ (యూజీ -2025)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుతంగా రాణించారన్నారు. దేశవ్యాప్తంగా 18వ ర్యాంకు సాధించిన తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్‌సాయి కుమార్‌, 19వ ర్యాంకు సాధించిన ఏపీకి చెందిన దర్బా కార్తీక్‌రామ్‌లకు అభినందనలు తెలిపారు. ‘‘మీ కృషి ఫలించింది, వైద్య వృత్తి కలను నెరవేర్చుకోవాలనుకునే ఆశావహులందరికీ ప్రేరణగా నిలుస్తుంది’’అని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande