పోలవరం.ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ బారన్ డ్యాం నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర జల సంఘ్ బృందం
అమరావతి, 15 జూన్ (హి.స.) , :పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్‌, బట్రస్‌ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం శనివారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్‌ పైథాంకర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ హెచ్‌.ఎస్.సెనెగర్‌, ప్రాజెక్టు అథారిటీ చీఫ్‌ ఇంజనీర్‌ రమేశ్
పోలవరం.ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ బారన్ డ్యాం నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర జల సంఘ్ బృందం


అమరావతి, 15 జూన్ (హి.స.)

, :పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్‌, బట్రస్‌ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం శనివారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్‌ పైథాంకర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ హెచ్‌.ఎస్.సెనెగర్‌, ప్రాజెక్టు అథారిటీ చీఫ్‌ ఇంజనీర్‌ రమేశ్‌ కుమార్‌ల బృందం ఉదయం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకుంది. మోడల్‌ రూంలో ఉన్న ప్రాజెక్టు నమూనా పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో సీపేజీ నివారణ కోసం నిర్మిస్తున్న బట్రస్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌, గ్యాప్‌ 1 నిర్మాణ పనులను, ఎగువ, దిగువ కాపర్‌ డ్యాంలు, స్పిల్‌ వే ప్రాంతాలను, కాంక్రీట్‌ మిక్సింగ్‌ ల్యాబ్‌లను పరిశీలించింది. కేంద్ర జల సంఘం బృందానికి సీఈ కె.నరసింహమూర్తి, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్‌ సంబంధిత వివరాలను తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande