స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ..కిషన్ రెడ్డి
హైదరాబాద్, 15 జూన్ (హి.స.) మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.. అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. ఎవడో పనికి రాని వాడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలా? అని మం
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.. అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. ఎవడో పనికి రాని వాడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలా? అని మండిపడ్డారు. కుటుంబ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. స్థానిక ఇష్యూల ఎజెండా గానే ఎన్నికలకి వెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలకి వివరిస్తామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande